షర్మిల నేటి యాత్ర 15 కిమీ

మహబూబ్‌నగర్:

మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి సోదరి అయిన వైయస్ షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర మంగళవారం బూడిదపాడు గ్రామ శివారు ప్రాంతం నుంచి ప్రారంభిస్తారని పార్టీ కార్యక్రమ సమన్వయకర్త  తలశిల రఘురాం, జిల్లా కన్వీనర్ ఎడ్మ కిష్టారెడ్డి తెలిపారు. బూడిదపాడు శివారు నుంచి యాత్ర మొదలై పెద్దపల్లి, కుర్వపల్లి క్రాస్ ఆ తర్వాత నియోజకవర్గ కేంద్రమైన గద్వాలలో ప్రవేశిస్తారు. రైల్వే స్టేషన్ రోడ్, రాజీవ్ రోడ్ కు  చేరుకుంటారు. అక్కడే వైఎస్‌ఆర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశంలో షర్మిల మాట్లాడతారు. అనంతరం రాయచూర్ రోడ్ మీదుగా వెళ్లి ఆ రాత్రికి నోబెల్ స్కూల్ సమీపంలో బస చేస్తారు. మంగళవారం షర్మిల మొత్తం 14.9 కి.మీ నడుస్తారని వివరించారు.

Back to Top