రాజన్నబిడ్డకు ఘనస్వాగతం..!

మూడ్రోజుల పాటు 18 కుటుంబాలకు పరామర్శ..!

కరీంనగర్ః దివంగత ముఖ్యమంత్రి డా. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి షర్మిల చేపట్టిన రెండో విడత పరామర్శయాత్ర కరీంనగర్ జిల్లాలో కొనసాగుతుంది. మలివిడత పరామర్శయాత్రలో భాగంగా కరీంనగర్ కు చేరుకున్న షర్మిలకు తోటపల్లి వద్ద  వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. హుస్నాబాద్ లో షర్మిల రోడ్ నిర్వహించారు. అనంతరం నియోజకవర్గంలో మొత్తం 8 కుటుంబాలను పరామర్శించారు. అండగా ఉంటామని వారికి భరోసానిచ్చారు. సముద్రాలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి షర్మిల, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. 

ఇచ్చిన మాట ప్రకారం..!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకుంటామని వైఎస్ జగన్ కర్నూలులో నల్లకాల్వ వద్ద మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం ఆకుటుంబ ప్రతినిధిగా వైఎస్ షర్మిల పరామర్శయాత్ర కొనసాగిస్తున్నారు. అందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. అడుగడుగునా ప్రజలు షర్మిలకు బ్రహ్మరథం పడుతున్నారు. రాజన్న బిడ్డను చూసి పులకించిపోతున్నారు. 

బాధితులకు అండగా రాజన్న బిడ్డ..!
వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని జీర్ణించుకోలేక జిల్లాలో మొత్తం 30 మంది చనిపోయారు. సెప్టెంబర్ 22,23,24 తేదీల్లో వైఎస్ షర్మిల జిల్లాలో పర్యటించి మొత్తం 12 కుటుంబాలను ఓదార్చారు. మిగిలిన 18 కుటుంబాలను పరామర్శించేందుకు మలివిడత యాత్ర చేపట్టారు. మూడ్రోజుల పాటు మొత్తం 481 కి.మీ. మేర వైఎస్ షర్మిల యాత్ర కొనసాగుతుంది. షర్మిల వెంట వైఎస్సార్సీపీ రాష్ట్ర అధ్యక్షుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతర  నేతలు ఉన్నారు.
Back to Top