కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
వైయస్ జగన్కు భయపడి సారీ చెప్పించారు
27 Mar 2017 2:26 PM
విజయవాడ: ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో టీడీపీ అరాచకాన్ని ఎక్కడ ఎండగడతారోననే భయంతోనే చంద్రబాబు తన ఎంపీ, ఎమ్మెల్యేలతో ఐఏఎస్ అధికారికి సారీ చెప్పించారని ఎమ్మెల్యే పుష్ఫశ్రీవాణి విమర్శించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆమె మాట్లాడుతూ విజయవాడ నగర నడిబొడ్డులో టీడీపీ నేతలు అధికారి బాలసుబ్రమణ్యంపై దాడికి తెగబడటాన్ని ఖండిస్తున్నామన్నారు. విజయవాడ నగరాన్ని చంద్రబాబు రౌడీ రాజ్యంగా మారుస్తున్నారని ధ్వజమెత్తారు. ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని దాడి చేస్తే స్వయాన ముఖ్యమంత్రి మీడియేటర్గా వ్యవహరించారని ఆరోపించారు. ఎమ్మార్వో వనజాక్షి సంఘటనను నీరుగార్చారని దుయ్యబట్టారు. అంటే మహిళలకు ప్రభుత్వం ఏ విధంగా రక్షణ కల్పిస్తోందో అర్థం చేసుకోవాలన్నారు. చెంప చెల్లుమనిపించి సారీ సార్ అంటే సరిపోతుందా అని ఎద్దేవా చేశారు. ఆ అధికారి మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయో. వారి ఫ్యామిలీ ఎంత బాధపడివుంటుందో ప్రభుత్వం ఆలోచించదా అని ధ్వజమెత్తారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని ప్రశ్నించారు.