హత్యా రాజకీయాలు చేస్తున్న పయ్యావుల

అనంతపురం: హత్యా రాజకీయాలకు
టీడీపీ ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ పెట్టింది పేరని వైఎస్సార్సీపీ అనంతపురం జిల్లా
అధ్యక్షుడు శంకర్ నారాయణ వ్యాఖ్యానించారు. ప్రతిపక్షనేత
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి కేశవ్ కు లేదని ఆయన అన్నారు. రైతులను బెదిరించి నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో
పయ్యావుల భూములను కూడబెట్టారని పేర్కొన్నారు. అక్రమాలు జరిగినందునే రిజిస్ట్రేషన్
శాఖ వెబ్ సైట్ ను ప్రభుత్వం బ్లాక్ చేసిందని ఆయన మండిపడ్డారు. రాజధాని అమరావతి
భూకంభకోణంపై కేంద్రం జోక్యం చేసుకోవాలని వైఎస్ఆర్ సీపీ నేత శంకర్ నారాయణ విజ్ఞప్తి
చేశారు.

Back to Top