విజయవాడ: ఢిల్లీలో దీక్ష చేస్తే క్షణాల్లో ఆయన్ను అరెస్ట్ చేస్తారనే భయం ఉండబట్టే చంద్రబాబు విజయవాడ కేంద్రంగా దీక్ష చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ విజయవాడ పార్లమెంటరీ పార్టీ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయభాను పేర్కొన్నారు. ఒక్కోమంత్రి ఒక్కో జిల్లాలో దీక్షకు కూర్చోవటం ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయటం కాదా అని ప్రశ్నించారు. ఆర్టీసీ బసులన్నీ ఆయన దీక్షకు జనాలను తీసుకువెళ్లటానికి కేటాయించటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని తెలిపారు. సీఎం చంద్రబాబు కుటుంబం కార్పొరేట్ హంగులకు అలవాటు పడిందన్నారు. కానీ తమ నేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఎండలను సైతం లెక్క చేయకుండా నడుస్తున్నారని అన్నారు. <br/>