పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, సమన్వయకర్తగా సజ్జల రామకృష్ణారెడ్డి

అనంతపురం : వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనంతపురం జిల్లాతో పాటు కర్నూలు, వైయస్‌ఆర్‌ కడప, ప్రకాశం జిల్లాల పార్టీ వ్యవహారాల పర్యవేక్షణ, సమన్వయకర్తగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం చేపట్టారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

Back to Top