బాబు సర్కార్ కు చెంపపెట్టు

చెన్నైః చంద్రబాబు సర్కారుకు చుక్కెదురైంది. సదావర్తి సత్రం భూముల వేలం పాట దాదాపు మూడింతలు పెరిగింది. తక్కువ ధరకు సదావర్తి భూములు కొట్టేయాలన్న చంద్రబాబు కుట్రలకు బ్రేక్ పడింది. సదావర్తి భూములను అప్పనంగా కొట్టేయాలని చంద్రబాబు ప్లాన్ వేయడంతో వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఇవాళ సదావర్తి భూముల వేలం మళ్లీ కొనసాగింది. వేలంలో రూ. 60.30 కోట్ల ధర పలికింది.

Back to Top