టీడీపీకి సదావర్తి షాక్

న్యూ ఢిల్లీః  టీడీపీకి సదావర్తి షాక్ తగిలింది. సదావర్తి భూముల వేలంను మళ్లీ నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మోసం జరుగుతుంటే కళ్లు మూసుకోలేమని పేర్కొంది. వేలంలో ప్రతివాదులు కూడ తప్పనిసరిగా పాల్గొనాలని సూచించింది.  వేలం ఆపాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాల మేరకు వేలం నిర్వహించాలని ఆదేశించింది. చంద్రబాబు ప్రభుత్వం వేలకోట్ల విలువ చేసే భూములను తన అనుయాయులకు అప్పనంగా కట్టబెట్టిన సంగతి తెలిసిందే. సదావర్తి ఆక్రమాలపై వైయస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పోరాటం కొనసాగిస్తున్నారు.

Back to Top