రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రైతులపై చిన్న చూపు
28 Jul 2015 5:45 PM
గుంటూరు : చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత మోపిదేవి వెంకట రమణ మండి పడ్డారు. గుంటూరు జిల్లా నిజాం పట్నంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాలు లేక నారుమడులు పోయాలా వద్దా అన్న సందిగ్దత పట్టి పీడిస్తోందని, వ్యవసాయిక పరిస్థితులపై సమాచారం ఇవ్వటంలోవ్యవసాయ శాఖ విఫలం అయిందని ఆయన అన్నారు. రైతులకు మనో ధైర్యం కల్పించటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని ఆయన అన్నారు. చంద్రబాబుకి ఉదయం నుంచి రాత్రి దాకా రాజధాని జపం తప్ప వేరే అంశాలు పట్టడం లేదని ఆయన విమర్శించారు. పాత బకాయిలు తీర్చ కపోవటంతో బ్యాంకులు రైతులకు అప్పులు ఇవ్వటం లేదని మోపిదేవి అన్నారు. అటువంటప్పుడు పెట్టుబడులు దొరికే పరిస్థితి లేక రైతులు విల విల్లాడుతున్నారని ఆయన అభిప్రాయ పడ్డారు.