కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
హామీల అమలులో చంద్రబాబు విఫలం
21 Aug 2018 12:00 PM
విశాఖ: ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని మాజీ రిటైర్డ్ ఎస్పీ ప్రేమ్బాబు విమర్శించారు. విశాఖ జిల్లా పాయకరావు పేట నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర లో వైయస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ..టీడీపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు. విశాఖ రైల్వేజోన్, ప్రత్యేకహోదా, దుగ్గరాజు పట్నం పోర్టు ,కడప స్టీల్ప్లాంట్ తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు. ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవాల్సిన అవసరం ఉందన్నారు.ఇందుకోసం వైయస్ జగన్ పోరాడుతున్న స్ఫూర్తి తనకు నచ్చి పార్టీలో చేరానని పేర్కొన్నారు. ప్రజల కష్టాలు తీరాలంటే వైయస్ జగన్ సీఎం అవ్వాలన్నారు. రాజన్న రాజ్యం జగనన్నతోనే సాధ్యమని విశ్వాసం వ్యక్తం చేశారు.