మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
డ్వాక్రా మహిళల హర్షం
16 Jul 2018 11:33 AM
తూర్పు గోదావరి: మహిళలు సంతోషంగా ఉంటేనే సమాజం బాగుంటుందని మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తరచుగా చెప్పేవారు. ఆయన బాటలోనే వైయస్ జగన్ నడుస్తున్నారు. సంఘమిత్ర, వీవోఏ, వెలుగు యానిమేటర్లకు వైయస్ జగన్ వరాల జల్లు కురిపించారు. యానిమేటర్లు రూ.5 వేలు జీతం ఇవ్వాలని వైయస్ జగన్కు విజ్ఞప్తి చేయగా, రూ.10 వేలు జీతం ఇస్తామని మహిళల కరతాళ ధ్వనుల మధ్య వైయస్ జగన్ ప్రకటించారు. వైయస్ జగన్ నిర్ణయం పట్ల డ్వాక్రా మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న తనను కలిసిన మహిళలతో వైయస్ జగన్ మాట్లాడుతూ..మహిళలు సంతోషంగా ఉంచడమే తన లక్ష్యమన్నారు. మహిళలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే నవరత్నాల్లో భాగంగా పొదుపు మహిళల రుణాలను నాలుగు ధపాలుగా నేరుగా సభ్యుల చేతులకే ఇస్తామని ప్రకటించారు. అంతేకాకుండా సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తానని చెప్పడం, ఇప్పుడు వెలుగు సిబ్బందికి వేతనాలు రూ.10 వేలు పెంచుతామని ప్రకటించడం పట్ల డ్వాక్రా సంఘాల సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పాదయాత్రలో పలువురు మహిళలు వైయస్ జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.