అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
చంద్రబాబు చరిత్ర హీనుడు
14 Aug 2015 6:48 PM
హైదరాబాద్) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చరిత్ర హీనుడని వైఎస్సార్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. పదవుల కోసం తెలుగు జాతిని విడగొట్టాలని లేఖ ఇచ్చిన హీనుడని ఆమె అభివర్ణించారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్రకార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఆ నాడు మామ ఎన్టీయార్ కు వెన్నుపోటు పొడిచిన చరిత్ర కూడా చంద్రబాబుదే అని ఆమె అన్నారు. విధాన పత్రాల సంగతి తర్వాత కానీ, ముందుగా ముఖ్యమంత్రిగా తన హయంలో జరిగిన అవినీతిపై చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం విడుదల చేయాలని రోజా డిమాండ్ చేశారు. గోదావరి పుష్కరాల్లో ఎంత తిన్నారో బయట పెట్టాలని ఆమె అన్నారు. జీవో నెంబర్ 22 ఇచ్చి ప్రాజెక్టుల అంచనాలు పెంచేందుకు ఎంత తీసుకొన్నారో వెల్లడించాలని ఆమె అన్నారు.