జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది దుర్మార్గం
23 Jul 2015 8:51 PM
తిరుపతి) క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కు క్లీన్ చిట్ ఇవ్వటాన్ని పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు రోజా తప్పు పట్టారు. ఇది ఒక దుర్మార్గ చర్య గా ఆమె అభివర్ణించారు. చింతమనేని ని వెనుకేసుకొని రావటానికి మహిళా అధికారిని బలి పెట్టడం ఎంత వరకు భావ్యం అని ఆమె అన్నారు. తిరుపతి లో ఆమె మీడియాతో మాట్లాడారు. ఒక మహిళా తహశీల్దార్ కే రక్షణ లేదంటే, ఇక సామాన్య మహిళకు ఏమాత్రం రక్షణ ఉన్నట్లు అని ఆమె ప్రశ్నించారు. వనజాక్షి తరపున ఉద్యోగుల సంఘాలు పోరాటం చేయాలని ఆమె పిలుపు ఇచ్చారు. దీనికి వైఎస్సార్సీపీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆమె అన్నారు.