మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ముందుచూపు లేని ముఖ్యమంత్రి
02 May 2016 11:00 AM
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్లో కరువు పరిస్థితులను ఎదుర్కోవడంలో చంద్రబాబు సర్కార్ పూర్తిగా విఫలమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కె రోజా అన్నారు. కరువుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన పోరుబాటలో భాగంగా తిరుపతి ధర్నా కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ..చంద్రబాబు, కరువు కవల పిల్లలని ధ్వజమెత్తారు. బాబు ఎప్పుడు సీఎం అయినా కరువు వస్తుందని దుయ్యబట్టారు.
చంద్రబాబుకు కరువుపై ముందు చూపు లేదని...ఉన్నదంతా మొండిచూపేనన్నారు. రాష్ట్రంలో కరువుతో అల్లాడుతున్న ప్రజలను గాలికి వదిలేసి.. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలుకే చంద్రబాబు మొగ్గుచూపుతున్నారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ఎండలు తీవ్రంగా ఉన్నా ప్రభుత్వం ఏ మాత్రం ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న మజ్జిగ కేంద్రాల హామీ ఏమైందని ఆమె ప్రశ్నించారు. ప్రజా సమస్యలపై ప్రజల పక్షాన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని రోజా తేల్చిచెప్పారు.