రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
టీడీపీ నుంచి తిరిగి వైయస్సార్సీపీలో చేరిక
31 Jul 2016 12:24 PM
తెలుగుదేశంలో చేరినప్పటికీ, అక్కడ అప్రజాస్వామిక విధానాలు నచ్చక నాయకులు నెమ్మది నెమ్మదిగా వాస్తవం తెలుసుకొని తిరిగి వైయస్సార్సీపీ లో చేరుతున్నారు. శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పేట జెడ్పీటీసీ సభ్యురాలు కుదారి హజరత్తమ్మ శనివారం ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్రెడ్డి సమక్షంలో తిరిగి వైఎస్సార్ సీపీలో చేరారు. అధికార పార్టీలో ఉంటే ప్రజలకు సేవ చేయవచ్చని ఆ పార్టీ నాయకులు చెబితే వెళ్లానని, అయితే అక్కడ ప్రజలకు సేవచేసే విధానం కనిపించడం లేదని ఆమె పేర్కొన్నారు. ఏఎస్పేట ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆమెకు ఎమ్మెల్యే గౌతమ్రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పం దిళ్లపల్లి సుబ్బారెడ్డి, మండల మహిళా కన్వీనర్ బోయిళ్ల పద్మజారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తనకు రాజకీయ భిక్ష పెట్టి సమాజంలో గౌరవ ప్రతిష్టలు కల్పించిన కన్నతల్లిలాంటి వైఎస్సార్ సీపీని వీడానని, నెలరోజులుగా మనోవేదనకు గురయ్యానని చెప్పారు.
తనను నమ్మి ఓట్లేసి గెలిపించిన ఓటర్ల ఆశలు వమ్ము చేయకూడదని నిర్ధారించుకుని వైఎస్ జగన్మోహన్రెడ్డి చేసే ప్రజా పోరాటాలకు మద్దతు పలికి ప్రజా సమస్యలు పరిష్కరించాలన్న నిర్ణయంతో తిరిగి సొంతగూటికి వచ్చినట్లు హజరత్తమ్మ చెప్పారు.