త్వరలోనే అధర్మ పాలనకు ముగింపు..

వైయస్‌ఆర్‌సీపీ నేత రెడ్డి తిరుపతి నాయుడు
విజయనగరంః జననేత వైయస్‌ జగన్‌కు వస్తున్న స్పందన కనీవినీ ఎరగని స్థాయిలో  ఉందని మాజీ జడ్పిటీసీ,వైయస్‌ఆర్‌సీపీ నేత రెడ్డి తిరుపతి నాయుడు అన్నారు. ఏపీ  పరిస్థితి అధ్వాన్నంగా ఉందన్నారు. ద్వాపర యుగంలో  ఎక్కడయితే అధర్మం పెరుగుతుందో, ధర్మం నశిస్తుందో.. దుష్టశిక్షణ.. శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలో నేను పుడతానని అర్జునుడితో శ్రీకృష్ణుడు అంటాడని, అదేవిధంగా ఈ కలియుగంలో చంద్రబాబు పాలన ఆశ్రిత పక్షపాతంతో అధర్మంతో సాగుతుందని, టీడీపీ దుష్టపాలన నుంచి ప్రజలను రక్షించడానికి  జగన్‌ అనే అవతారం సుపరిపాలన అందించడానికి వస్తున్నాడన్నారు.
Back to Top