అందుకే చంద్రబాబు ప్యాకేజీ ఒప్పుకున్నాడు

అవకాశాన్ని బట్టి మాట మార్చే వ్యక్తి ఏపీ సీఎం
హోదా కోసం పోరాడేవారంతా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోతారు
విశాఖలో రిలే నిరాహార దీక్షలకు ఎంపీ విజయసాయిరెడ్డి సంఘీభావం

విశాఖపట్నం: సొమ్ములు కూడబెట్టుకొని విదేశాల్లో దాచుకునేందుకే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీని ఒప్పుకున్నాడని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. అప్పుడు ప్యాకేజీ మేలని దోచుకోవడం ముగిసిన తరువాత.. ఇప్పుడు హోదా అంటూ ప్రజలను వంచించే కార్యక్రమం చేస్తున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు అవకాశాన్ని బట్టి మాట మార్చే వ్యక్తి అని దుయ్యబట్టారు. విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు చేపట్టిన రిలే నిరాహార దీక్షల్లో ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజీ  హోదాకు ప్రత్యామ్నాయం కాదని తెలిసినా ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రంలో ఏ విధంగా అభిబవృద్ధి చెందాయో మీకు తెలియదా అని నిలదీశారు. విభజన అంశాలు, ప్రత్యేక హోదా పై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని, ఎంత సేపు రాష్ట్ర సంపదను ఎలా దోచుకోవాలనే ఆలోచన చేస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వ మోసాలను ప్రజలంతా గమనిస్తున్నారని, తగిన సమయంలో మంచి గుణపాఠం చెబుతున్నారన్నారు.

ప్రత్యేక హోదా సాధన కోసం పోరాటం పోరాడుతున్న నాయకులు ఆంధ్రరాష్ట్ర చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతారని విజయసాయిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచే హోదా సాధించడంలో విఫలమయ్యారన్నారు. యూటర్న్‌ తీసుకొని హోదా అంటూనే ఉద్యమాన్ని అణచివేయాలని చూస్తున్నాడని ఆరోపించారు. ఈ నెల 16వ తేదీన వైయస్‌ఆర్‌ సీపీ, వామపక్షాలు, ప్రత్యేక హోదా సాధన సమితి ఇచ్చిన బంద్‌ వల్ల ప్రయోజనం లేదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉండగా.. ఎన్నిసార్లు బంద్‌లకు పిలునిచ్చిందో గుర్తు చేసుకో చంద్రబాబూ అని సూచించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడే పార్టీలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందన్నారు. టీడీపీ ఎంపీలు కేవలం కేంద్ర మంత్రి పదవులకే రాజీనామా చేశారని, హోదాపై నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఎంపీ సభ్యత్వాలకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు
Back to Top