రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
క్షీణించిన రవీంద్రనాథ్రెడ్డి ఆరోగ్యం
04 Mar 2015 3:33 PM
కడప: గాలేరు-నగరి, సర్వరాయసాగర్ ప్రాజెక్టు పనులను పూర్తి చేసి ప్రజలకు, రైతులకు తాగు, సాగు, నీరు అందించాలనే డిమాండ్తో వైఎస్ఆర్సీపీ పార్టీ కమాలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష బుధవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. వీరపునాయునిపల్లెలో ఆదివారం నిరవధిక దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. దీక్షలో ఉన్న ఆయనను పలువురు నేతలు పరామర్శించి వెళ్లారు. ఆరోగ్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు షుగర్ లెవెల్స్, రక్త పీడనం మెలమెల్లగా పడిపోతున్నాయని చెప్పారు.