చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రంగనాథరాజు చేరికతో జిల్లాలో పార్టీ బలోపేతం
27 May 2018 12:34 PM
పెదఅమిరంలో జననేత సమక్షంలో పార్టీలో చేరిన చెరుకువాడ
పశ్చిమ గోదావరి: చెరుకువాడ రంగనాథరాజు చేరికతో పార్టీ జిల్లాలో మరింత బలపడుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పెదఅమిరంలో వైయస్ జగన్ సమక్షంలో రంగనాథరాజు వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ మాట్లాడుతూ.. రంగరాజు అన్నను వైయస్ఆర్ సీపీలోకి సాధరంగా ఆహ్వానిస్తున్నామన్నారు. జిల్లాలో రంగరాజు అంటే మంచి పేరుందని, ప్రజాబలం కలిగిన నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడన్నారు. నాయకులు, కార్యకర్తలు ఆయన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకోవాలన్నారు.
మళ్లీ వైయస్ఆర్ కుటుంబంలో చేరడం సంతోషం.
అనంతరం రంగనాథరాజు మాట్లాడుతూ.. వైయస్ఆర్ కుటుంబంలో ఉండాలనే నాయకులు, కార్యకర్తల కోరిక మేరకు పార్టీలో చేరుతున్నానన్నారు. మళ్లీ వైయస్ఆర్ కుటుంబంలో చేరడం ఆనందంగా ఉందన్నారు. పాదయాత్ర ద్వారా అందరి హృదయాలను గెలుచుకుంటున్న వైయస్ జగన్మోహన్రెడ్డి గెలుపు కోసం నిరంతరం కృషి చేస్తానన్నారు.