రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించిన షర్మిల
11 Dec 2012 5:12 PM
కోళ్ళపడకల్(మహేశ్వరం):
మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మంగళవారం సాయంత్రం 5 గంటలకు రంగారెడ్ది జిల్లాలో ప్రవేశించింది. మహేశ్వరం మండలం కోలపడకల్ గ్రామంలో శ్రీమతి షర్మిల రంగారెడ్డి జిల్లాలో ప్రవేశించారు. మహబూబ్నగర్ జిల్లాలో ఆమె 295 కిలోమీట్లరు నడిచారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి షర్మిల అక్టోబరు 18న పాదయాత్ర ప్రారంభించిన సంగతి తెలిసిందే. అశేష ప్రజానీకం శ్రీమతి షర్మిలను తమ గ్రామంలోకి ఆహ్వానించారు. తొలుత షాద్నగర్ నియోజకవర్గంలోని పెంజర్ల గ్రామంలో ఆమె రచ్చబండ నిర్వహించారు. అందులో పాల్గొన్న మహిళలు తమ కష్టాలను శ్రీమతి షర్మిలకు వివరించారు.