రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
11న విజయనగరంలో నిరుద్యోగ భృతిపై నిరసన ర్యాలీ
03 Aug 2018 3:29 PM
విజయనగరం: ఎన్నికల సమయంలో నిరుద్యోగులందరికీ రూ. 2 వేల ఇస్తానని చెప్పి నాలుగేళ్లుగా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎన్నికలు దగ్గర పడుతున్నాయని యువతను మోసం చేస్తున్నారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ కొలగట్ల వీరభద్రస్వామి ధ్వజమెత్తారు. విజయనగరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ. 2 వేల భృతి ఇస్తానని ప్రకటించి రూ. వెయ్యి ఇవ్వడాన్ని వైయస్ఆర్ సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. నిరుద్యోగ భృతి రూ. 2 వేలు 40 ఏళ్ల వరకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ప్రత్యేక హోదా పేరుతో టీడీపీ దొంగ పోరాటాలు చేస్తోందని కొలగట్ల ధ్వజమెత్తారు. ఈ నెల 11వ తేదీన విజయనగరంలో నిరుద్యోగ భృతిపై నిరసన ర్యాలీ చేపడుతున్నట్లు పిలుపునిచ్చారు.