మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రాజధాని రైతులపై టీడీపీ కక్షసాధింపు చర్యలు
30 Aug 2018 1:28 PM
అమరావతిః రైతులపై టీడీపీ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. రాజధానికి భూములు ఇవ్వలేదనే నెపంతో వేధింపులకు గురిచేస్తునట్లు రైతులు ఆరోపిస్తున్నారు. ఉండవల్లిలో పంటపొలాల మధ్య హైటెన్షన్ విద్యుత్వైర్లను వేసేందుకు యత్నించిన అధికారులను రైతులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల సహకారంతో విద్యుత్ వెర్లును బలవంతంగా వేయడానికి ప్రయత్నించడంతో రైతులు, అధికారుల మ«ధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. మహిళలు అని కూడా లేకుండా పోలీసులు దౌర్జన్యంగా అరెస్ట్లు చేసీ పీఎస్కు తరలించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పురుగుమందు తాగేందుకు యత్నించారు. ఖాళీ స్థలంలో నుంచి వైర్లు వేసుకోవాలని చెప్పుతున్నా అధికారులు పెడచెవిన పెడుతున్నారని, బలవంతంగా తమ భూముల నుంచి వైర్లు వేస్తురన్నారన్నారు.. దీంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు.