రైతన్నకు‌ అండగా నిలిచిన వైయస్: షర్మిల

‌పుట్టగుంట (కృష్ణా జిల్లా), ఏప్రిల్‌ 2013: వడ్డీ లేని రుణాలిస్తామని చెప్పిన కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రభుత్వం రూపాయి వడ్డీ వసూలు చేస్తున్నదని పుట్టగుంట మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో కొనసాగుతున్న శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మంగళవారం పుట్టగుంట చేరుకుంది. గతంలో కంటే కరెంట్ బిల్లులు 600 రూపాయలు అదనంగా వ‌స్తున్నాయని శ్రీమతి షర్మిలకు పుట్టగుంట మహిళలు మొరపెట్టుకున్నారు. గ్రామాల్లో బెల్టు షాపులతో కుటుంబాలు నాశనమైపోతున్నాయని, మంచినీరు లేక వేసవిలో అనేక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.

చంద్రబాబు రాక్షస పాలన సాగించారని, వ్యవసాయం దండగ అన్న మాటలతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని.. ఆ సమయంలో మహానేత వైయస్‌ఆర్ పాదయాత్ర చేసి రైతులకు అండగా నిలిచారని‌ శ్రీమతి షర్మిల తెలిపారు. ప్రజ సమస్య పరిష్కారం కోసం వైయస్‌ఆర్ పాదయాత్ర చేపట్టి నేటికి పదేళ్లు పూర్తి అయిన విషయాన్ని‌ శ్రీమతి షర్మిల గుర్తుచేశారు.

వైయస్‌ఆర్ ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చారని, 1200 కోట్ల విద్యు‌త్ బకాయిలు మాఫీ చేశారని‌ శ్రీమతి షర్మిల తెలిపారు. ప్రస్తుత కిరణ్ కుమార్ ‌రెడ్డి పాలన చంద్రబాబు‌ను మరిపించేలా ఉందన్నారు. విద్యుత్ బిల్లులు కట్టలేక మహిళలు మంగళసూత్రాలు తాకట్టు పెడుతున్నారని..‌ జగనన్న సిఎం అయ్యాక రైతులు, మహిళలకు వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. రాష్ట్రంలో గుడిసెల్లో ఉన్నవారందరికీ పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. గ్రామాల్లో బెల్టు షాపు లేకుండా నియంత్రిస్తామని మహిళలకు శ్రీమతి షర్మిల భరోసా ఇచ్చారు.

తాజా వీడియోలు

Back to Top