బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
రాహుల్ వ్యాఖ్యలకు ఘాటైన జవాబు
25 Jul 2015 4:56 PM
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటూ పోరాడుతున్నది
వైఎస్ జగన్ మాత్రమేనని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది. పార్టీ
సీనియర్ నాయకులు, మాజీమంత్రి పార్థసారధి హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర
కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ
వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనకు రాజకీయం తెలియక పోయి ఉండాలి లేదంటే
దురుద్దేశం ఏమైనా ఉండాలని ఆయన అన్నారు. ఇదంతా ఆయన అవగాహనా
రాహిత్యానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా వైఎస్
జగన్ రెండుసార్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసి వినతి పత్రాలు
అందించారని గుర్తు చేశారు. మూడు నాలుగు సార్లు కేంద్ర హోంమంత్రి రాజ్
నాధ్ సింగ్ ను, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ని కలిసి
విన్నవించినట్లు వివరించారు. కేంద్రంలో మిత్రపక్షంగా ఉన్న టీడీపీ ఈ
అంశం మీద నోరు మెదపడటం లేదని పార్థసారధి అన్నారు. ఈ అంశం మీద చిత్త
శుద్ధి ఉంటే వెంటనే కేంద్రం నుంచి టీడీపీ వైదొలగాలని డిమాండ్ చేశారు.