రాష్ట్రవ్యాప్తంగా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ నిరసన దీక్షలు

హైదరాబా‌ద్, 28 మే 2013:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగ‌న్మోహన్‌రెడ్డి అక్రమ నిర్బంధానికి నిరసనగా మంగళవారంనాడు పార్టీ రాష్ట్రవ్యాప్తంగా నిరసన దీక్షలు ప్రారంభించింది. పార్టీ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి వైయస్ విజయమ్మ హైదరాబా‌ద్లోని ఇందిరాపా‌ర్కు వద్ద నిరసన దీక్ష చేపట్టారు. అలాగే కాకినాడలో పార్టీ నాయకుడు పిల్లి సుభాష్ చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రారంభమైనన నిరసన దీక్షలో గొల్ల బాబూరావు, ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి, బొడ్డు భాస్కర రామారావు, కుడుపూడి చిట్టబ్బాయి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మచిలీపట్నంలో వైయస్‌ఆర్ ‌కాంగ్రెస్‌ నాయకులు దీక్షలో కూర్చున్నారు. ఎమ్మెల్యేలు కొడాలి నాని, పేర్ని నాని, పార్టీ నాయకులు సామినేని ఉదయభాను, జలీల్‌ఖాన్, కుక్కల నాగేశ్వరరావు దీక్షలో పాల్గొన్నారు. కర్నూలులో చేపట్టిన దీక్షలో ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి, ఎస్వీ మోహ‌న్‌రెడ్డి, మాజీ మంత్రి మూలింటి మారెప్ప, చక్రపాణిరెడ్డి దీక్ష చేపట్టారు.

ఆదిలాబాద్లో చేస్తున్న నిరసన దీక్షలో బోడ జనార్థన్,‌ బి. జన‌క్ ప్రసాద్, కోనేరు కోనప్ప, సోయం బాబూరావు పాల్గొన్నారు. అనంతపురంలో వై‌యస్‌ఆర్ కాంగ్రె‌స్ ‌నాయకులు దీక్ష చేస్తున్నారు. దీక్షలో ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, తోపుదుర్తి కవిత, వై. విశ్వేశ్వరరెడ్డి కూర్చున్నారు. నిజామాబాద్లో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ‌నాయకులు బాజిరెడ్డి గోవర్థన్,‌ అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, శ్రీధ‌ర్‌రెడ్డి దీక్ష చేస్తున్నారు.

చిత్తూరులో వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ ‌నాయకులు దీక్ష చేపట్టారు. దీక్షలో పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి, మిధున్ రెడ్డి, నారాయణస్వామి, అమ‌ర్‌నాథ్‌రెడ్డి, ప్రవీణ్ కుమా‌ర్ రెడ్డి పాల్గొన్నారు. వై‌యస్‌ఆర్ జిల్లా కడప కలెక్టరే‌ట్ వద్ద వై‌యస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకులు దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు జిల్లా కన్వీన‌ర్ సురేష్‌బాబు, మాజీ మేయర్ రవీంద్రనా‌థ్‌రెడ్డి, కడప ఇంఛార్జి అంజాద్ బాషా తదితరులు హాజరయ్యారు.

విశాఖ‌పట్నంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ చేపట్టిన దీక్షలో దాడి వీరభద్రరావు, వంశీకృష్ణ‌ యాదవ్, గండి బాబ్జీ, చెంగల వెంకట్రా‌వు, ఎమ్మెల్సీ సర్వేశ్వరరావు పాల్గొన్నారు. మరోవైపు ఏడాది నుంచి‌ శ్రీ వైయస్ జగ‌న్ అక్రమ నిర్బంధానికి నిరసనగా కూకట్‌పల్లి నియోజకవర్గం వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ నాయకుడు వడ్డేపల్లి నర్సింగరావు ఆధ్వర్యంలో రెండు వేల మంది భారీ ర్యాలీ నిర్వహించారు.

Back to Top