గుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభం
'రాష్ట్ర రాజకీయాల్లో జగన్దే కీలకపాత్ర'
14 Feb 2013 1:41 PM
హైదరాబాద్, 14 ఫిబ్రవరి 2013: రాష్ట్ర రాజకీయాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి కీలక పాత్ర పోషిస్తారని ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు అన్నారు. కాంగ్రెస్, టిడిపిలు కుమ్మక్కై మహానేత డాక్టర్ వైయస్ కుటుంబాన్ని వేధిస్తున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమయంలో శ్రీ జగన్కు తాను అండగా ఉండాలని నిర్ణయించుకున్నానన్నారు. శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డితో తన భావాలను మనసు విప్పి పంచుకున్నట్లు భాస్కరరామారావు తెలిపారు. గురువారం ఉదయం 11.30 గంటల ప్రాంతంలో ఆయన చంచల్గూడ జైలుకు వెళ్ళి శ్రీ జగన్ను కలుసుకున్నారు. అనంతరం ఆయన జైలు వెలుపల కాసేపు మీడియాతో మాట్లాడారు.
తెలుగుదేశం పార్టీలో తమ అభిప్రాయాలు వెల్లడించేందుకు స్వేచ్ఛ లేదని భాస్కరరామారావు విమర్శించారు. సమైక్యాంధ్ర విషయంలో టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అనుసరిస్తున్న వైఖరి తనకు నచ్చలేదని స్పష్టం చేశారు. అందుకే తాను ఆ పార్టీ నుంచి బయటికి వచ్చేసినట్లు పేర్కొన్నారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాలను కొనసాగించడం శ్రీ జగన్కే సాధ్యం అని భాస్కరరామారావు చెప్పారు. మహానేత ప్రారంభించిన పథకాలు రాష్ట్రంలోని ప్రతి పేదవాని ఇంటికీ చేరాయని ఆయన అన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు చేరేదీ త్వరలోనే ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. భాస్కర రామారావు వెంట కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి కూడా ఉన్నారు.