రాజన్న రాజ్యం తథ్యం: భూమన

తిరుపతి, 15 మే 2013:

మరో పది నెలల్లో రాష్ట్రంలో రాజన్నరాజ్యం తథ్యమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి, చిత్తూరు జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి స్పష్టంచేశారు. పేదల కష్టాలను పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి తీరుస్తారని వారు తెలిపారు. కేంద్రంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. కిరణ్ సర్కార్ను గద్దె దించాలని ఈ సందర్భంగా భూమన ప్రజలకు పిలుపునిచ్చారు. గడపగడపకు వైయస్ఆర్ కాంగ్రెస్ పేరిట ప్రజలకు చేరువ కావాలని ఆయన సూచించారు.

Back to Top