వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
రాజన్న బిడ్డకు అండగా నడుస్తున్నాం
12 Nov 2012 1:12 PM
పత్తికొండ:
ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు పాదయాత్రగా వస్తున్నా రాజన్న బిడ్డ షర్మిలకు అండగా తామూ నడుస్తున్నామని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు, అయ్యప్ప మాలధారి జ్యోతుల నవీన్ చెప్పారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు చేస్తున్న నీచరాజకీయాలను ప్రజలకు వివరించడానికి పాదయాత్రకు వస్తున్న షర్మిలకు అన్ని వర్గాల ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారని చెప్పారు. గతంలో జననేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసుల నుంచి బయట పడాలంటూ జగ్గంపేట నుంచి అన్నవరం వరకు దాదాపు 10 వేల మందితో ఒకే రోజు 65 కిలో మీటర్లు పాదయాత్ర చేసి దేవాలయంలో పూజలు చేశామన్నారు. షర్మిల వెంబడి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేస్తామన్నారు. తనతో పాటు అయ్యప్ప స్వాములు జ్యోతుల ప్రవీణ్, నానాజీ, నాగబుబు, బ్రహ్మాజీ, శ్రీహరి పాదయాత్రలో కొనసాగుతున్నారని వివరించారు.