ఎమ్మెల్యే జ‌గ్గిరెడ్డి ధర్నా

 రాజ‌మండ్రి: అధికార పార్టీ నేత‌ల తీరును నిర‌సిస్తూ వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జ‌గ్గిరెడ్డి ధ‌ర్నాకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా రావులపాలెం మండలం పొడగట్లపల్లి-రాజవరం ఆర్అండ్‌బి రోడ్డు ప్రారంభోత్సవంలో అధికారులు  ప్రొటోకాల్‌ను విస్మ‌రించ‌డంతో జ‌గ్గిరెడ్డి ఆందోళ‌న‌కు దిగారు. ఈ క్ర‌మంలో పోలీసులు  అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించి వైయ‌స్ఆర్‌సీపీ కార్య‌క‌ర్త‌ల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. అధికారుల తీరును జ‌గ్గిరెడ్డి తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు.  

Back to Top