రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
నవ రత్నాలపై గ్రామస్థాయిలో ప్రచారం చేయాలి: పెద్దిరెడ్డి
13 Sep 2017 6:38 PM
రొంపిచెర్ల: వైయస్ఆర్సీపీ అధ్యక్షుడు వైయస్.జగన్మోహన్రెడ్డి ప్రకటించిన నవరత్నాలుపై గ్రామస్థాయిలో బూత్ కమిటీ సభ్యులు ప్రచారం చేయాలని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి బుధవారం రొంపిచెర్ల మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలకు ఒరిగింది ఎమి లేదన్నారు. ప్రజా పాలనలో విఫలమైన సీఎం చంద్రబాబు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారని తెలిపారు. టీడీపీ పార్టీని బంగాళాఖాతంలో కలిపే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విమర్శించారు. పేదల అభివృద్థి కోసం వైయస్ జగన్ 9 పథకాలను ప్రకటించారని గుర్తు చేశారు. వీటిపైన గ్రామాలలో కార్యకర్తలు విసృత ప్రచారం చేయాలని కోరారు. రొంపిచెర్లలో గుండెపోటుతో మృతి చెందిన మాజీ ఎమ్మెల్యే సైపూల్లా బేగ్ సోదరుడు ఇనాయతుల్లాబేగ్ కటుంబ సభ్యులను పరమర్శించారు. తనకు ఇనాయతుల్లాబేగ్ అప్త మిత్రుడని కొని యాడారు. యన కుటుంబ సభ్యులకు తాను అండగా ఉంటానని తెలియజేశారు. అలాగే అనారోగ్యంతో బాద పడుతున్న అహ్మద్అలీబేగ్, హబిబుల్లాబేగ్లను పరమర్శించారు. వారి ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకోన్నారు. మోటుమల్లెల నగిరిలో కాన్సర్ వ్యాధితో మృతి చెందిన ఉపాధ్యాయుడు రమేష్నాయుడు కర్మక్రియలకు హాజరు అయ్యారు.