మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
సిఎంతో పాటు అంతా పదవులను వదలాల్సిందే
11 Sep 2013 12:16 PM
హైదరాబాద్, 11 సెప్టెంబర్ 2013: రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి సహా సీమాంధ్ర ప్రజాప్రతినిధులంతా రాజీనామా చేయాల్సిందేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రవీణ్ కుమార్రెడ్డి డిమాండ్ చేశారు. పదవులను వదలకుండానే సమైక్యాంధ్ర ముద్ర వేయించుకుంటామంటే కుదరదని ఆయన అన్నారు. టిడిపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు రాజీనామాలు చేస్తే విభజన ప్రకటన వెనక్కి వెళుతుందని ప్రవీణ్ కుమార్రెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తన వైఖరి చెప్పకుండా ఆత్మగౌరవ యాత్ర చేయటం సిగ్గుచేటు అన్నారు. సీమాంధ్రలో జరుగుతున్న ఆందోళనలు, నిరసనలు కాంగ్రెస్ పార్టీకి కనిపించటం లేదా అని ప్రవీణ్ కుమార్రెడ్డి ప్రశ్నించారు.