చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అసెంబ్లీని ఎన్టీఆర్ భవన్ లా మార్చేశారు
23 Dec 2015 11:57 AM
నెల్లూరు: స్పీకర్ కోడెల శివప్రసాదరావు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లా మార్చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి విమర్శించారు. కాల్ మనీ సెక్స్ రాకెట్, ఇతర కుంభకోణాలపై చర్చ జరిగితే ముఖ్యమంత్రి చంద్రబాబు బండారం బయటపడుతుందనే స్పీకర్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. రాజ్యాంగ హోదాలోని వ్యక్తి ఇలా ప్రవర్తించడం శోచనీయమన్నారు.
అధికారపక్షానికి పూర్తి అనుకూలంగా, పక్షపాతపూరితంగా వ్యవహరిస్తూ ప్రతిపక్షనేతకు కనీసం మైక్ కూడా ఇవ్వనందుకు నిరసనగా స్పీకర్ కోడెల శివప్రసాద్పై వైఎస్సార్సీపీ అవిశ్వాసం అస్త్రాన్ని ప్రయోగించింది.