చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ జగన్ను సీఎం చేసుకుందాం
29 Mar 2018 5:20 PM
గుంటూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలన త్వరలోనే చూడబోతున్నామని, వైయస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఎంపీ బాలశౌరీ చెప్పారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పెదకూరపాడులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. గత నాలుగేళ్లగా టీడీపీ పాలనను చూశారని, గ తంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి ఈ నియోజకవర్గంలో 10 ఎత్తిపోతల పథకాలు చేపట్టిన వేలాది ఎకరాలను సాగులోకి తెచ్చారన్నారు. తప్పుడు వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఒక్క ఎకరాకైనా నీరు ఇచ్చారా ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. వేల కోట్లు పట్టిసీమ పేరుతో టీడీపీ నేతలు పంచుకున్నారని విమర్శించారు. పులిచింతల ప్రాజెక్టును కట్టిన మహానుభావుడు ఈ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు రుణమాఫీ పేరుతో అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేశారన్నారు. బ్యాంకుల్లోనే ఇంకా బంగారం ఉందన్నారు. బంగారం ఉండాల్సింది నా అక్కా చెల్లెమ్మల మెడలో ఉండాలని వైయస్ జగన్ అంటున్నారన్నారు.