మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్
తునిలో ప్రకాశిస్తున్న జననేత పాద కిరణాలు
11 Aug 2018 4:06 PM
103వ నియోజకవర్గంలోకి అడుగుపెట్టిన జననేత
దారిపొడువునా వైయస్ జగన్కు స్వాగత తోరణాలు
ఆకట్టుకుంటున్న భారీ కటౌట్లు, బ్యానర్లు
భారీ బహిరంగ సభకు సిద్ధమైన తుని
తూర్పుగోదావరి: తునిలో జననేత పాద కిరణాలు ప్రకాశిస్తున్నాయి. తమ కష్టాలు తీర్చే నాయకుడు వచ్చాడంటూ నియోజకవర్గ ప్రజలు సంబరపడుతున్నారు. జననేత అడుగులో అడుగు వేస్తూ మా మద్దతు మీకే అనే సంకేతాలు ఇస్తున్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన ప్రజా సంకల్పయాత్ర 234వ రోజు 103వ నియోజకవర్గం తునిలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు జననేతకు ఘనస్వాగతం పలికారు. అన్నా.. కష్టాలు తీర్చండన్నా.. అంటూ వారి సమస్యలు చెప్పుకుంటూ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఒకొక్కరిది ఒక్కో సమస్య తన వద్దకు వచ్చిన వారి బాధలు వింటూ అండగా ఉంటా.. న్యాయం చేస్తా.. చేసేదే చెబుతా.. చెప్పిందే చేస్తానంటూ వారికి భరోసా ఇస్తూ వైయస్ జగన్ ముందుకు సాగుతున్నారు.
పాదయాత్ర సాగే దారంతా వైయస్ జగన్ కటౌట్లతో కళకళలాడుతోంది. సాయంత్రం తునిలో జరగబోయే భారీ బహిరంగ సభకు నియోజకవర్గం సిద్ధమైంది. తుని మొత్తం వైయస్ఆర్ సీపీ జెండాలతో నిండిపోయింది. జననేత బ్యానర్లు, భారీ కటౌట్లతో ప్రధాన కూడళ్లు నిండిపోయాయి. వైయస్ జగన్కు స్వాగతం పలుకుతూ రోడ్డుకు ఇరువైపులా కట్టిన ఫ్లెక్సీలు ఆకట్టుకుంటున్నాయి. సాయంత్రం తునిలో జరిగే భారీ బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరుకానున్నారు. సభకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ నాయకులు పూర్తి చేశారు.