సీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే
జననేత ఆదరణ చూసి ప్రభుత్వంలో గుబులు
04 Jan 2018 3:40 PM
డోన్, బాడీ కెమెరాలతో పాదయాత్ర పరిశీలిస్తున్న సర్కార్
చిత్తూరు: ప్రజా సంకల్పయాత్రకు పెరుగుతున్న ఆధరణ చూసి ప్రభుత్వంలో అలజడి మొదలైంది. చంద్రబాబు సొంత జిల్లాలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డికి ప్రజా సంకల్పయాత్రలో విశేష ఆదరణ పెరుగుతుండడంతో ప్రభుత్వం నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. డోన్ కెమెరాలను, బాడీ కెమెరాలను పెట్టి ప్రతీ అడుగును చిత్రీకరించేందుకు నిఘా ఏర్పాటు చేశారు. పాదయాత్ర గురించి చర్చించమని ఒకవైపు చెబుతూనే కెమెరాల ద్వారా ఫుటేజీని ఎప్పటికప్పుడు చూస్తున్నారని తెలుస్తుంది. ఇంటలీజెన్స్ వర్గాలకు పూర్తి సమాచారం అందిస్తున్నారు. పాదయాత్రకు మద్దతు పెరుగుతుండడంతో, ప్రజలకు నవరత్నాల పథకాల వివరాలను చంద్రబాబు తెలుసుకుంటున్నట్లు సమాచారం. పాదయాత్రకు సంబంధించి ఎవరెవరు వైయస్ జగన్ను కలుస్తున్నారు.. అనే విషయాలను తెలుసుకుంటున్నారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి చంద్రబాబు ప్రభుత్వంలో గుబులు మొదలైంది.