రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజ
పాపంపేట బైపాస్ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
13 Dec 2017 10:57 AM
అనంతపురం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి 34వ రోజు అనంతపురం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్ మండలం పాపం పేట బైపాస్ నుంచి జననేత పాదయాత్ర ప్రారంభించారు. రుద్రం పేట, సవేరా ఆసుపత్రి క్రాస్, కాకల్లపల్లి క్రాస్, డాల్ఫిన్స్ హోటల్ రోడ్డు మీదుగా ప్రసన్నపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. మధ్యాహ్న భోజనం అనంతరం 3 గంటలకు తిరిగి పాదయాత్ర మొదలుపెట్టనున్నారు. చిన్మయ నగర్ మీదుగా కొనసాగుతూ పాదయాత్ర రాప్తాడుకు చేరుకుంటుంది. రాప్తాడులో సాయంత్రం 4 గంటలకు వైయస్ జగన్ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి సమావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు గంగలకుంటలో 34వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.