పాపంపేట బైపాస్ నుంచి ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం


 అనంతపురం : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్ఆర్‌సీపీ అధ్య‌క్షులు వైయ‌స్ జగన్‌ మోహన్‌ రెడ్డి 34వ రోజు అనంతపురం నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగిస్తున్నారు. బుధవారం  ఉదయం 8 గంటలకు అనంతపురం రూరల్‌ మండలం పాపం పేట బైపాస్‌ నుంచి జననేత పాదయాత్ర ప్రారంభించారు. రుద్రం పేట, సవేరా ఆసుపత్రి క్రాస్‌, కాకల్లపల్లి క్రాస్‌, డాల్ఫిన్స్‌ హోటల్‌ రోడ్డు మీదుగా ప్రసన్నపల్లి వరకు పాదయాత్ర కొనసాగుతుంది. మ‌ధ్యాహ్న భోజ‌నం అనంతరం 3 గంటలకు తిరిగి పాదయాత్ర మొదలుపెట్ట‌నున్నారు. చిన్మయ నగర్‌ మీదుగా కొనసాగుతూ పాదయాత్ర రాప్తాడుకు చేరుకుంటుంది. రాప్తాడులో సాయంత్రం 4 గంటలకు వైయ‌స్‌ జగన్‌ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి సమావేశంలో ప్రసంగిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు గంగలకుంటలో 34వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.  

Back to Top