‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభం
ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి
17 Dec 2012 12:53 PM
పెనుకొండ:
ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలనీ, లేకుంటే ప్రజల మనుగడే ప్రశ్నార్థకమవుతుందనీ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు సానిపల్లి మంగమ్మ చెప్పారు. బోయపేటతో పాటు గోనిపేట, వెంకటాపురం తండాలకు చెందిన 350 మంది ప్రజలు పార్టీలో చేరారు. నాయకులు తోపుదుర్తి ప్రకాష్రెడ్డి, మంగమ్మ, తదితరులు పార్టీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానించారు. ప్రభుత్వ తీరును ఎండగట్టడానికి ప్రతి మహిళా సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. జగనన్నను సీఎం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలన్నారు. తోపుదుర్తి ప్రకాష్రెడ్డి మాట్లాడుతూ సామాజిక ఆర్థిక, రాజకీయ, విద్య, వైద్య రంగాల్లో వాల్మీకులు అభివృద్ధి సాధించాలని పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి లక్ష్యమనీ, ఈ నేపథ్యంలోనే మంగమ్మకు అత్యంత కీలకమైన కేంద్ర పాలక మండలి పదవిని అప్పగించారనీ చెప్పారు.