సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
16 నుంచి ప్రకాశం జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర
12 Feb 2018 1:06 PM
ఒంగోలు:
పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకోడానికి వైయస్ ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 16 వ తేదీ నుంచి ప్రకాశం జిల్లాలో ప్రవేశించనుంది. ఇప్పటికే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోకి ఈ నెల 16 వ తేదీన వస్తుందని ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. జిల్లాలోని 9 నియోజకవర్గాల్లో దాదాపు 255 కిలోమీటర్ల మేర జననేత పాదయాత్ర చేయనున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లాలో కందుకూరులో మొదలై, కొండపి, కనిగిరి, మార్కాపురం, సంతనూతలపాడు, దర్శి, అద్దంకి, పర్చూరు, చీరాల్లో ప్రజా సంకల్పయాత్ర నిర్వహించనున్నారు. దాదాపు 20 రోజుల పాటు ఈ జిల్లాలో పాదయాత్ర జరుగనుంది.