మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
1800 కి.మీ చేరువలో ప్రజా సంకల్పయాత్ర
18 Apr 2018 11:37 AM
విజయవాడ: ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు వైయస్ ఆర్ కాంగ్రెస్ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజా సంకల్పయాత్ర కాసేపట్లో మరో మైలు రాయిని చేరుకోనుంది. ప్రస్తుతం కృష్ణా జిల్లా మైలవరం లో జరుగుతున్న పాదయాత్ర గణపవరం వద్ద 1800 కిలోమీటర్ల మార్కును దాటనుంది. పాదయాత్రలో మైలురాయి తమ గ్రామంలో పూర్తి కానున్న నేపథ్యంలో గణపవరం ప్రజలంతా సందడి చేస్తున్నారు. ఊరంతా పండుగ వాతావరణం నెలకొంది. 1800 కిలోమీటర్ల మైలురాయిను చేరుకున్న ప్రాంతంలోపెద్ద ఎత్తున స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా వైయస్ జగన్ ఒక మొక్కను నాటడంతో పాటు పార్టీ జెండా ఆవిష్కరణ కూడా చేయనున్నారు.
గత ఏడాది నవంబరు 6 వ తేదీన ప్రారంభమైన పాదయాత్ర ఇప్పటి వరకు కడప, అనంతపురం, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం , గుంటూరు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతూ, అడుగులో అడుగేస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఎక్కడ చూసినా ప్రతిరోజూ వందలాది మంది ప్రజలు తమ సమస్యలను జననేతకు వివరిస్తూ పరిష్కరించమని విజ్ఞప్తి చేస్తున్నారు.