చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
ప్రభుత్వ పతనానికి కాకినాడ ఎన్నికలే నాంది
22 Aug 2017 3:21 PM
కాకినాడ: చంద్రబాబు ప్రభుత్వ పతనానికి కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలే నాంది అవుతాయని ఎన్నికల ఇన్చార్జ్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి హెచ్చరించారు. నగరంలో ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా చెవిరెడ్డి మాట్లాడుతూ.. ఏ సమస్యను కూడా చంద్రబాబు పరిష్కరించకుండా మాయ మాటలతో మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలను, అన్ని కులాలను ఆయన మోసం చేశారని ధ్వజమెత్తారు. మోసపోయిన కాకినాడలోని విజ్ఞులు టీడీపీకి కార్పొరేషన్ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలనే నిర్ణయానికి వచ్చారని తెలిపారు. చంద్రబాబు చేసిన తప్పులకు, ఇచ్చిన వాగ్ధానాలపై చెంప చెల్లుమనిపించేలా ఓటు అనే ఆయుధంతో తీర్పు ఇచ్చి రాష్ట్రవ్యాప్తంగా పట్టినటువంటి చంద్రబాబు పీడను వదలించాలని కాకినాడ ప్రజలు నిర్ణయించుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు మేలు చేసే నాయకుడు వైయస్ జగన్ ఒక్కడే అన్న నిర్ణయానికి ప్రజలు వచ్చారన్నారు. కాకినాడ ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ మేయర్ పీఠాన్ని కైవాసం చేసుకుంటుందని ఆయన చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.