చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు
02 Dec 2016 11:45 AM
నెల్లూరు: అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, పార్టీలు మారుతుంటాయని, అధికారులు వారి విధులు నిజాయితీగా నిర్వర్తించి ప్రజలకు మేలు చేయాలని వైయస్ఆర్సీపీ నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్కుమార్యాదవ్ సూచించారు. నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ వరకు జరుగుతున్న డివైడర్ పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఎక్కడైనా అత్యవసరంగా మంచినీటి కోసం జనం బోరు వేయమని కార్పొరేషన్ అధికారులను అడిగితే దానికి టెండర్ పిలిచేందుకు సాకులు చెబుతున్నారని ఫైర్అయ్యారు. అదే డివైడర్లో మట్టి తీసేందుకు మాత్రం అత్యుత్సాహం చూపుతున్నారని, ఈ అధికారులు ప్రజలకు మేలు చేయకుండా కాంట్రాక్టర్లకు, అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. వీఆర్సీ నుంచి దాదాపు వంద మీటర్ల వరకు టెండర్లు పిలువకుండా నామినేషన్ పద్దతితో పనులు కట్టబెట్టడం వెనుక ఉన్న రహస్యం ఏంటని ప్రశ్నించారు. నెల్లూరు మునిసిపల్ కార్పొరేషన్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై జిల్లా కలెక్టర్ దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో వైయస్ఆర్సీపీ కార్పొరేటర్ దేవరకొండ అశోక్, నాయకులు దార్ల వెంకటేశ్వర్లు, వేలూరు మహేష్, రంగ, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.