రాజన్నను దేవుడిగా పూజిస్తున్నారు..!

కరీంనగర్ః ఎక్కడికెళ్లినా ప్రజలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని దేవుడిగా పూజిస్తున్నారని  వైఎస్ ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.  వైఎస్ షర్మిలను రాజన్న బిడ్డగా, జగనన్న సోదరిగా ప్రజలే ఓదార్చారని ఆయన అన్నారు. కరీంనగర్ జిల్లాలో వైఎస్ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర ముగిసింది. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ షర్మిల జిల్లాలో రెండు విడతలుగా ఆరు రోజులు పర్యటించి, 30 కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు.

ప్రభుత్వం నిర్లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా 1400మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని  పొంగులేటి వెల్లడించారు. కల్తీకల్లుకు ఆరుగురు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు.  ప్రభుత్వం వెంటనే రైతులకు భరోసా కల్పించేలా నవంబర్ లోగా పంట రుణాలు మాఫీ చేసి, కొత్త రుణాలు ఇవ్వాలని, అలాగే కరవు మండలాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులకు అండగా ఉంటే విపక్షాలన్నీ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు.  వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన తోటపల్లి, ఎల్లంపల్లి, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులును రీడిజైన్ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని పొంగులేటి మండిపడ్డారు.
Back to Top