మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ప్రజల తరపున పోరాటం :ఎంపీ పొంగులేటి
04 Apr 2016 10:16 PM
హైదరాబాద్: తెలంగాణ లో ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల తరపున పోరాటం చేయాలని తెలంగాణ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పిలుపు ఇచ్చారు. ఈ మేరకు ఆయన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పిలుపు ఇచ్చారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని కేంద్ర కార్యాలయంలో టీ వైఎస్సార్సీపీ రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో తెలంగాణలోని కరువు, రైతు ఆత్మహత్యలు, ప్రాజెక్టుల రీడిజైన్ వంటి పలు ప్రజాసమస్యలపై చర్చించినట్లు పార్టీ నేతలు శివకుమార్, కొండా రాఘవరెడ్డి, రెహ్మాన్లు వెల్లడించారు. ప్రజల పక్షాన పోరాడేందుకు అవసరమైన కార్యచరణను రూపొందిస్తామని నేతలు వెల్లడించారు.