మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
అర్ధరాత్రి జగన్ దీక్ష భగ్నం
10 Oct 2013 10:43 AM
హైదరాబాద్ :
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించవద్దంటూ.. సమైక్యంగానే ఉంచాలని కోరుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి ఐదు రోజులుగా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు బుధవారం అర్ధరాత్రి భగ్నం చేశారు. శ్రీ జగన్ను బలవంతంగా నిమ్సు ఆసుపత్రికి తరలించారు. తనకు ఫ్లూయిడ్సు ఎక్కించవద్దని, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం దీక్షను కొనసాగిస్తానని శ్రీ జగన్మోహన్రెడ్డి వైద్యానికి నిరాకరించినా పోలీసుల సాయంతో నిమ్సు వైద్యులు బలవంతంగా ఫ్లూయిడ్సు ఎక్కించారు.
సమైక్యాంధ్రప్రదేశ్ కోసం శ్రీ జగన్మోహన్రెడ్డి నెల రోజుల వ్యవధిలో రెండవ సారి ఆమరణ నిరాహార దీక్ష చేశారు. గడచిన ఐదు రోజులుగా దీక్షలో ఉన్న శ్రీ జగన్కు బుధవారంనాడు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు రెండు దఫాలుగా పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం బాగా క్షీణించిందని, తక్షణం ఫ్లూయిడ్సు ఎక్కించకపోతే ప్రమాదకరమని ప్రభుత్వానికి, పోలీసుకులకు నివేదించారు. నెల రోజులలోనే రెండవసారి ఆమరణ దీక్షకు దిగిన నేపథ్యంలో శ్రీ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం ఆందోళనకర స్థితికి చేరిందని వారు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో శ్రీ జగన్ దీక్ష చేస్తున్న లోటస్పాండ్ ప్రాంతానికి రాత్రి 10 గంటల ప్రాంతంలో పోలీసులు భారీ ఎత్తున చేరుకున్నారు. ఒకవైపు వర్షం కురుస్తున్నప్పటికీ పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేసుకుని అంబులెన్సు రప్పించారు.
బుధవారం రాత్రి 11 గంటల సమయంలో పోలీసులు పెద్ద సంఖ్యలో దీక్షా శిబిరం వేదికపైకి చొచ్చుకువచ్చి శ్రీ జగన్ను బలవంతంగా తరలించడానికి ప్రయత్నించారు. అయితే శ్రీ జగన్ తన దీక్షను భగ్నం చేయవద్దని రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కన్నా తన ప్రాణాలు ముఖ్యం కాదంటూ ప్రతిఘటించారు.
ముందుగా నగర సంయుక్త పోలీస్ కమిషనర్ (స్పెషల్ బ్రాంచ్) మల్లారెడ్డి, పశ్చిమ జోన్ డిసిపి సత్యనారాయణ పరిస్థితిని వివరించి దీక్ష విరమించాలని శ్రీ జగన్మోహన్రెడ్డిని కోరారు. తనకు ఏమీ కాదని, దీక్ష కొనసాగిస్తానని శ్రీ జగన్ చెబుతున్నప్పటికీ పోలీసులు వినిపించుకోలేదు. శిబిరం పరిసర ప్రాంతాల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు పోలీసుల ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించారు. వేదికపైకి చేరుకున్న పోలీసు అధికారులు తొలుత శ్రీ జగన్తో చర్చించారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఒక్కసారిగా ఆయనను ఎత్తుకుని వేదిక నుంచి అంబులెన్సు వద్దకు తీసుకు వచ్చారు. ఈ సందర్భంగా కార్యకర్తలు 'జై సమైక్యాంధ్ర' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అన్యాయంగా, నిరంకుశంగా వ్యవహరించి శ్రీ జగన్ దీక్షను భగ్నం చేయడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారంటూ వారంతా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలోనే శ్రీ జగన్ను అంబులెన్సులో ఎక్కించుకుని, నిమ్సు ఆస్పత్రికి తరలించారు.
ఫ్లూయిడ్సు వద్దని ప్రతిఘటించిన శ్రీ జగన్ :
నిమ్సు ఆసుపత్రిలో బలవంతంగా ఫ్లూయిడ్సు ఎక్కించడానికి వైద్యులు యత్నించగా.. శ్రీ జగన్మోహన్రెడ్డి ప్రతిఘటించారు. సమైక్యాంధ్ర కోసం తన ఆమరణ దీక్షను కొనసాగించనివ్వాలని వైద్యులను, పోలీసులను ఆయన కోరారు. ఈ పరిస్థితుల్లో నిమ్సు వైద్యులు డాక్టర్ లక్ష్మీ భాస్కర్, డాక్టర్ వంశీకృష్ణారెడ్డి అర్ధరాత్రి 12.20 గంటల సమయంలో మీడియాతో మాట్లాడుతూ.. శ్రీ జగన్మోహన్న్డ్డి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, వైద్యానికి ఆయన తిరస్కరిస్తున్నారని చెప్పారు. ఆయన ఆరోగ్యం దృష్ట్యా బలవంతంగా అయినా ఫ్లూయిడ్సు ఎక్కిస్తామని తెలిపారు. ఈ విషయాన్ని శ్రీ జగన్మోహన్రెడ్డి కుటుంబసభ్యులకు తెలిపినట్లు చెప్పారు. తర్వాత 12.30 గంటల సమయంలో పోలీసుల సాయంతో వైద్యులు బలవంతంగా శ్రీ జగన్కు ఫ్లూయిడ్సు ఎక్కించారు. దీనితో ఐదు రోజులుగా శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష భగ్నమైంది.
నిమ్సుకు చేరుకున్న విజయమ్మ, భారతి :
ఢిల్లీ నుంచి బుధవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న శ్రీ జగన్మోహన్రెడ్డి మాతృమూర్తి శ్రీమతి వైయస్ విజయమ్మ హుటాహుటిన నిమ్సుకు వెళ్ళారు. శ్రీ జగన్ను నిమ్సుకు తరలించిన విషయం తెలుసుకున్న ఆమె రాత్రి 11.25 గంటల సమయంలో శ్రీ జగన్ సతీమణి శ్రీమతి వైయస్ భారతి, పార్టీ నాయకురాలు భూమా శోభా నాగిరెడ్డితో కలిసి ఆస్పత్రికి వెళ్లి శ్రీ జగన్ను పరామర్శించారు.
కాగా, శ్రీ జగన్మోహన్రెడ్డిని చూడడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ ఎత్తున వస్తారని తెలిసి పోలీసులు నిమ్సు ఆస్పత్రి పరిసరాల్లో ముందుగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శ్రీ జగన్ను ఆస్పత్రిలోనికి తరలించగానే గేట్లు మూసివేసి లోనికి ఎవరినీ అనుమతించకుండా కట్టడి చేశారు.
వెంటవెంట దీక్షలతో ఆరోగ్యానికి ప్రమాదం :
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలనే డిమాండ్తో ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండడంతో శ్రీ జగన్మోహన్రెడ్డి ఆరోగ్యం బుధవారం బాగా క్షీణించింది. రాత్రి దీక్ష భగ్నానికి ముందు బుధవారం ఉదయం ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి చెందిన డా.రఫీ (ఆర్ఎంఓ), డా.రామచంద్రరావు (జనరల్ ఫిజీషియన్), డా.అభిమన్యుసింగ్ (అనస్థీషియా), డా. వలీ (నెఫ్రాలజిస్టు) తదితరులతో కూడిన వైద్య బృందం రెండు దఫాలుగా శ్రీ జగన్కు వైద్య పరీక్షలు నిర్వహించింది. ఐదు రోజులుగా దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆయన రక్తంలో చక్కెర స్థాయి పడిపోవడంతో పాటు కీటోన్ బాడీస్ వేగంగా పెరిగాయని, ఇది ఆందోళనకర అంశమని హెచ్చరించింది. ఫ్లూయిడ్సు తీసుకొని తక్షణం దీక్ష విరమించకపోతే ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని వైద్య నిపుణులు పరీక్షల అనంతరం శ్రీ జగన్కు తెలిపారు.
అయినప్పటికీ దీక్ష విరమించడానికి శ్రీ జగన్ ఒప్పుకోలేదు. రాష్ట్ర విభజనపై సిడబ్ల్యుసి నిర్ణయం ప్రకటించిన తర్వాత శ్రీ జగన్మోహన్రెడ్డి జైలులోనే ఆగస్టు 25న ఆమరణ దీక్ష ప్రారంభించారు. అయితే జైలు అధికారులు ఆయనను నిమ్సుకు తరలించారు. అక్కడా దీక్ష కొనసాగించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఆగస్టు 31న బలవంతంగా ఫ్లూయిడ్సు ఎక్కించి దీక్ష భగ్నం చేశారు. బెయిల్పై బయటకు వచ్చాక మళ్లీ ఆమరణ దీక్ష ప్రారంభించారు. కేవలం మధ్యలో నెల రోజుల వ్యవధిలో ఇలా రెండవసారి శ్రీ జగన్ ఆమరణ దీక్ష చేయడం ఏమాత్రం మంచిది కాదని, భవిష్యత్తులో ఆరోగ్యంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు హెచ్చరించారు.
అభిమానుల్లో ఆందోళన :
బుధవారం ఉదయం దీక్షాస్థలికి వచ్చిన పార్టీ శ్రేణులు తమ అభిమాన నాయకుడి ఆరోగ్యం పట్ల ఆందోళనగా కనిపించారు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిని తలుచుకుని, తండ్రి బాటలో ఆయన తనయుడు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తున్నదని కొందరు మహిళలు కంటతడి పెట్టారు. వైయస్ఆర్ మరణించిన తర్వాత ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా ఆయన నిత్యం ప్రజల్లోనే ఉన్నారు. తరువాత అక్రమంగా కేసులు బనాయించి టిడిపి, కాంగ్రెస్లు కుమ్మక్కయి ఆయనను జైలుకు తరలించడం, ఇప్పుడు ఆయనకు బెయిల్ వచ్చిన తర్వాత కూడా ప్రజల కోసం ఆయన పడుతున్న కష్టాలను తలుచుకుని ఉద్విగ్నతకు లోనయ్యారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుంచి శ్రీ జగన్మోహన్రెడ్డి పడుతున్న శ్రమ తన సొంతం కోసం కారాదని, నిత్యం రాష్ట్ర ప్రజల సంక్షేమమే ఊపిరిగా ఆయన నడుస్తున్నారని గుంటూరు జిల్లాకు చెందిన ఓ మహిళా కార్యకర్త వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి వర్షం పెద్ద ఎత్తున పడుతున్నప్పటికీ అభిమానుల సందోహం తగ్గలేదు. వర్షంలోనూ వారు దీక్షా వేదిక ముందు నిల్చొని తమ అభిమాన నాయకుడికి సంఘీభావం ప్రకటించారు. సమైక్యాంధ్ర కోసం ప్రాణాలకు లెక్కచేయకుండా శ్రీ జగన్ దీక్ష చేస్తుండటంతో ఆయన ఆరోగ్యం ఆందోళనకర స్థితికి చేరిందని ఈ సందర్భంగా దీక్షస్థలి వద్ద పలువురు ప్రజలు, అభిమానులు కంటతడి పెట్టుకున్నారు.