విజయవాడలో పోలీసుల అత్యుత్సాహం

విజయవాడ: కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సొంత భవనాలపై వైయస్సార్సీపీ నేతలు ఏర్పాటు చేసుకున్న కృష్ణా పుష్కరాల ఫ్లెక్సీలను తొలంగించాలంటూ పోలీసులు ఆంక్షలు విధించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఫ్లెక్సీలు తప్ప ఎవరికీ అనుమతి లేదంటూ బలవంతంగా ఫ్లెక్సీలు తొలగించేందుకు సిద్ధమయ్యారు. పోలీసులు తీరుపై  జోగి రమేష్, నాగిరెడ్డి అభ్యంతరం తెలిపారు. ఫ్లెక్సీలు తొలగించాలంటూ పోలీసులు ఆంక్షలు విధించడం పట్ల వారు నిరసన తెలిపారు. దీంతో పోలీసులకు, నేతలకు మధ్య వాగ్వాదం నెలకొంది.

Back to Top