మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
తిరుపతి పవిత్రతకు భంగం కలిగించిన విహెచ్
18 Aug 2013 11:33 AM
తిరుపతి, 18 ఆగస్టు 2013:
టిటిడి పవిత్రతకు రాజ్యసభ సభ్యుడు వి. హనుమంతరావు భంగం కలిగించారని వైయస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆరోపించారు. టిటిడి నిబంధన ఉల్లంఘన కింద విహెచ్పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలనిప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. తిరుమలలో రాజకీయ ప్రస్థావనలేవీ తీసుకురాకూడదనే నిబంధన ఉందని చెవిరెడ్డి గుర్తు చేశారు.
వి.హనుమంతరావు శనివారం శ్రీవారి దర్శనానికి తిరుమల వచ్చి.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాల్సిందే అని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో ఉండాలంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి సాధారణ ప్రజలు ఉంటే తమకు అభ్యంతరం లేదని అన్నారు. విహెచ్ వ్యాఖ్యలతో ఆగ్రహం చెందిన సమైక్యవాదులు అలిపిరి వద్ద ఆయన వాహనాన్ని అడ్డుకుని నిరసన తెలిపారు.