రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
సీమాంధ్రులను అవమానిస్తున్న పోలీసులు
13 Oct 2013 1:34 PM
హైదరాబాద్ :
సీమాంధ్రులను పోలీసులు సంఘ విద్రోహ శక్తులంటూ అవమానించారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమా శోభా నాగిరెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ నెల 19న హైదరాబాద్ ఎల్.బి. స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు అనుమతి నిరాకరిచడం అంటే సీమాంధ్ర ప్రజలను అవమానించడమే అని ఆమె అన్నారు. పార్టీ సభకు అనుమతి నిరాకరించడంపై ఆమె మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్రెడ్డి సమైక్య ఉద్యమాన్ని నీరుగారుస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఒక గేమ్ ఆడుతుందని.. దానిలో భాగంగానే సభకు అనుమతి ఇవ్వకుండా అడ్డుకున్నారని శోభా నాగిరెడ్డి ఆరోపించారు.
చంద్రబాబు నాయుడు ఢిల్లీ ఎ.పి. భవన్లో దీక్షకు దిగిన విషయాన్ని ఈ సందర్భంగా శోభా నాగిరెడ్డి గుర్తుచేశారు. చంద్రబాబుకు ఎ.పి. భవన్లో దీక్ష చేసేందుకు అనుమతి ఇచ్చి.. సమైక్య సభకు హైదరాబాద్లో అనుమతి ఇవ్వకపోవడం శోచనీయమని ఆమె నిప్పులు చెరిగారు.