వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఎంపీ చొరవతో ఇద్దరికి పీఎం సహాయ నిధి
23 Jun 2017 6:20 PM
పులివెందుల : కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి చొరవతో ఇద్దరికి ప్రధానమంత్రి సహాయ నిధి మంజూరైనట్లు పులివెందులలోని ఎంపీ కార్యాలయ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి. కొండాపురం మండలం పాత కొండాపురంకు చెందిన ఈశ్వరరెడ్డి కుమార్తె చామల శిరీష అప్లస్టిక్ అనమియా అనే వ్యాధితో బాధపడుతూ వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. అలాగే చంద్రమోహన్ శ్రేష్టి హైదరాబాద్లోని గ్లోబెల్ ఆసుపత్రిలో లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స చేయించుకుంటున్నాడు. వీరి పరిస్థితిని కడప ఎంపీ వైయస్ అవినాష్రెడ్డి దృష్టికి కుటుంబ సభ్యులు తేవగా.. ఆయన ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశారు. ఇందుకు స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం వారికి ఒక్కొక్కరికి రూ.3లక్షల చొప్పున ఆసుపత్రి చికిత్సలకు నిధులు మంజూరు చేసింది.