రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
ప్లీనరీని విజయవంతం చేయాలి
08 Jun 2017 6:18 PM
విడవలూరు: వైయస్సార్సీపి అధిష్టానం మేరకు ఈ నెల 16వ తేదీన కోవూరులో జరిగే నియోజకవర్గ స్థాయి ప్లీనరీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన విడవలూరులోని ఆ పార్టీ కన్వినర్ బెజవాడ గోవర్ధన్రెడ్డి నివాస గృహంలో గురువారం కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోవూరులోని రుక్మిణి కళ్యాణ మండలంలో జరిగే ఈ ప్లీనరీకి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, నెల్లూరు ఎంపీ మేకపాటిరాజమోహన్రెడ్డి, తిరుపతి ఎంపీ వరప్రసాద్లతో పాటు మన జిల్లా వైయస్సార్సీపి ఎమ్మెల్యేలు, చిత్తూరు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఈ కార్యక్రమానికి హజరవుతారని తెలిపారు. విడవలూరు మండలం నుంచి భారీ సంఖ్యలో ఈ కార్యక్రమానికి కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ ప్లీనరీకి ముందు కార్యకర్తలచే బైక్ ర్యాలీ ఉంటుందని, ఈ కార్యక్రమంలో అందరు పాల్గొనాలని కోరారు. వచ్చిన ప్రతి నాయకుడు, కార్యకర్త, అభిమానులను నిరాశ పరచకుండా అందరికి అన్ని అందే విధంగా కమిటీ సభ్యులు వ్యవహరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపి నాయకులు వెంకయ్య, స్టాలిన్, మస్తానయ్య, మల్లికార్జున్రావు, బాస్కర్, రాధయ్య, సత్యం, వావిళ్ల రమణయ్య, గోవింద్, ప్రభాకర్, దేవరపల్లి శ్రీనివాసులరెడ్డి, గండవరపు వివేక్రెడ్డి, ప్రసాద్గౌడ్, జనార్ధన్రెడ్డి, అనిల్, సత్యం, తదితరులు పాల్గొన్నారు.