చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
కోదండ రామాలయాన్ని అభివృద్ధి చేయండి
11 May 2016 10:59 AM
రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఒంటిమిట్ట కోదండరామాలయాన్ని అభివృద్ధి చేయాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి మహేశ్శర్మను కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. కోదండరామాలయం వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగిన పురాతన ఆలయమని, సంవత్సరం పొడవునా లక్షలాదిమంది భక్తులు వస్తుంటారని తెలిపారు.
ఇది చారిత్రకమైన హిందూ ఆలయమే కాకుండా పురాతన సాంస్కృతిక క్షేత్రమని తెలిపారు. అయితే ఈ క్షేత్రానికి వస్తున్న భక్తులకు సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. ముఖ్యంగా బస చేసేందుకు సరైన సౌకర్యాలు లేవన్నారు. ఈ ఆలయానికి మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పురాతన సాంస్కృతిక క్షేత్రంగా గుర్తించాలని కోరారు.